మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా సినిమాకు మొదట ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఉంటుందని అన్నారు. టైటిల్ లోగో అప్పుడు కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పి హంగామా చేసిన చిత్రయూనిట్ అందులోంచి కెమెరామన్ రవివర్మను.. మ్యూజిక్ డైరక్టర్ రెహమాన్ ను తప్పించారు. అయితే రెహమాన్ ప్లేస్ లో కొన్నాళ్లు తమన్ అని.. మరికొన్నాళ్లు కీరవాణి అని వార్తలు వచ్చాయి.  


టైటిల్ లోగో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టిన తమన్ సినిమా మ్యూజిక్ డైరక్టర్ గా ఛాన్స్ వస్తుందని అనుకున్నారు. కాని అలా జరగలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలుగుతాడో లేదో అన్న అపనమ్మకంతో తమన్ కు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక మరో పక్క కీరవాణి కూడా ఈ సినిమా చేయనన్నాడని టాక్. 


ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ మ్యాస్ట్రో ఇళయరాజా వద్దకు వెళ్లిందట. ఇటీవల పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్న ఇళయరాజా సైరాకు సరైన సంగీత దర్శకుడు అతనే అని అంటున్నారు. చిరు, ఇళయరాజా కాంబోలో ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారన్నమాట. అయితే ఇళయరాజా మ్యూజిక్ డైరక్టర్ గా కన్ఫామా కాదా అన్నది తెలియలేదు. 


సురేందర్ రెడ్డి డైరక్షన్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సైరా సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా రాబోతుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. 2019 సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: