ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం మోడల్స్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి రావాలంటే...మోడలింగ్ చేస్తూ ఎక్స్ పీరియన్స్ సంపాదించి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ కూడా మోడలింగ్ చేసిన తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక దీపికా పదుకొనే..ఈ అమ్మడు కూడి కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి మోడలింగ్ గా ఉంటూ..తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
తాజాగా మరో మోడల్ కూడా తెలుగు తెరపై కనిపించబోతుంది..ఇంతకీ ఆ మోడల్ ఎవరా అనుకుంటున్నారా..! ‘ఎయిర్టెల్ 4జీ గురించి తెలుసా’ అంటూ ఎయిర్టెల్ ప్రకటనల్లో కన్పించి అలరించిన సాషా చెత్రి గుర్తుందా? 19 ఏళ్ల ఈ భామ త్వరలో టాలీవుడ్లో తెరంగేట్రం చేయబోతోందట. జార్ఖండ్కు చెందిన ఈ భామ... మోడల్గా, మ్యూజిషియన్గా గుర్తింపు తెచ్చుకున్న... ఈ బ్యూటీ త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందట.
మొన్నటి వరకు టీవీ కమర్షియల్స్లో కనిపించిన సాషాకు... పిలిచి మరీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మోడల్గా, మ్యుజీషియన్గా ఈమెకి మంచి గుర్తింపు ఉంది. టీవీ కమర్షియల్స్లో నటించిన సాషాకు ‘వినాయకుడు’, ‘కేరింత’ ఫేం సాయి కిరణ్ అడివి తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో కథానాయికగా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
సినిమాల్లో చేసిన అనుభవ లేదు కాబట్టి... ప్రత్యేకంగా ఈ మూవీ కోసం సాషా హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటోందట. ఇప్పటికీ తనను ఎయిర్టెల్ గర్ల్ అంటూ పిలుస్తుంటారని.... సాషా చెబుతుంటుంది. మరి ఈ ఎయిర్టెల్ భామ తెలుగులో ఏమాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ను పెంచుకుంటుందో చూడాలి.