తెలుగు ఇండస్ట్రీలో షాపింగ్ మాల్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా..జర్నీతో మంచి పేరు తెచ్చుకుంది అంజలి. ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఏంటో నాకలా తెలిసిపోతాయ్..అంటూ అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా అంజలి అమాయకత్వం చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా పెద్ద సక్సెస్ కాలేదు.
ఆ మద్య లేడీ ఒరియెంటెడ్ గా తెరకెక్కిన ‘గీతాంజలి’ కాస్త పరవాలేదు అనిపించుకుంది. ఈ అమ్మడు తెలుగు లో కన్నా తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించింది. తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లిన తర్వాత బొద్దుగా తయారైంది..అంజలి. కొంత కాలంగా డైటింగ్ చేస్తూ..ఈ మద్య కాస్త సన్నబడింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అంజలిమర్ పాత్రలకు కూడా సై అంటోంది. అంతేకాదు ముద్దు సీన్లపై బోల్డ్ గా కామెంట్ చేసింది.
ఓ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... 'ముద్దు సీన్ల చిత్రీకరణ సమయంలో ఎలా ఫీల్ అవుతారు?' అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది.‘ముద్దు సీన్లు షూట్ చేసేటప్పుడు చాలా వరకూ సోలో గానే నటించాల్సి ఉంటుంది. ఎదురుగా కెమెరాను ఉంచి.. ఎవరో ఉన్నట్టు ఊహించుకుని ముద్దు సీన్లలో నటించాల్సి ఉంటుంది.
అయితే అలా నటించడం వల్ల సీన్ పండొచ్చు పండక పోవచ్చు. అయితే ఎదురుగా హీరో ఉంటే..నిజమైన అనుభూతి కలుగుతుంది..ముద్దు సీన్ బాగా పండుతుంది. హావభావాలు బాగా పలికించవచ్చు. ఎవరూ లేకుండా కిస్ సీన్లలో నటించాలంటే నాకు చాలా కష్టం బాబూ..’ అంటూ ముద్దు సీన్ల గురించి ఓపెన్గా మాట్లాడేసింది అంజలి.