త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తాడని అన్నారు. సినిమా ఓపెనింగ్ కు అనిరుధ్ కూడా వచ్చాడు కాబట్టి కాని అజ్ఞాతవాసి ఫ్లాప్ అవడంతో అనిరుధ్ మీద విమశలు వచ్చాయి. త్రివిక్రం మ్యాజిక్ కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో అనిరుధ్ ను తారక్ సినిమాకు ఆపేయాలని నిర్ణయించారట.


అనిరుధ్ ప్లేస్ లో ఎస్.ఎస్.తమన్ కు ఆ ఛాన్స్ ఇస్తున్నారట. త్రివిక్రం సినిమాలకు మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే మ్యూజిక్ అందించారు అఆ సినిమాకు మిక్కీ జే మేయర్ మొదటిసారి సంగీతం అందించాడు. ఇక అజ్ఞాతవాసికి అనిరుధ్ మ్యూజిక్ అందించగా అది కాస్త నిరాశ పరచింది. ఇక తారక్, త్రివిక్రం సినిమాకు అనిరుధ్ ప్లేస్ ను తమన్ రీప్లేస్ చేశాడని లేటెస్ట్ టాక్.  


కోలీవుడ్ లో రాక్ స్టార్ అయిన అనిరుధ్ తెలుగులో మొదటి సినిమా ఇంప్రెస్ చేయలేకపోయాడు. అయితే అనిరుధ్ కు మరో ఛాన్స్ ఇద్దామని అనుకున్నా ఎన్.టి.ఆర్ వద్దనేశాడట. ఇక ఈమధ్య తమన్ మ్యూజిక్ బాగా ఇస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన భాగమతి, తొలిప్రేమ సినిమాల హిట్ కు తమన్ మ్యూజిక్ కూడా కొంత సహకరించింది. 


మొత్తానికి తారక్ తో ఇదవరకే పనిచేసిన తమన్ మొదటిసారి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. దర్శకుడిగా మంచి టేస్ట్ ఉన్న త్రివిక్రం తమన్ నుండి ఎలాంటి సంగీతం రాబట్టుకుంటాడో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల తమన్ కు ఈ ఛాన్స్ దక్కిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: