తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో..అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం తర్వాత నటించిన ‘దేశముదురు’, ‘బన్ని’, ‘ఆర్య’ చిత్రాలతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. యాక్షన్, డ్యాన్స్ తో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఎదిగారు. 

ఇక సరైనోడు చిత్రం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న బన్నీ ప్రస్తుతం ‘నా పేరు సూర్య’ చిత్రంలో నటిస్తున్నాడు.  ఇక స్టార్ ప్రముఖ రచయిత, దర్శకులు రవిరాజా పినిశెట్టి అంటే తెలియని వారు ఉండరు. ఈయన తెలుగు, తమిళ భాషలలో ఇంతవరకు దాదాపు 35 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తనయుడు ఆదిపినిశెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 

ప్రస్తుతం హీరోగా నటిస్తూనే..విలన్ గా కూడా నటిస్తున్నాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాళ్లు ఆది, బన్ని.  ట్విస్ట్ ఏంటంటే..వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘సరైనోడు’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: