క్రేజీ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ ఎంత సక్కగున్నావే రిలీజ్ అయ్యింది. సాంగ్ అందరిని ఇంప్రెస్ చేయగా.. ఈ సాంగ్ విషయంలో చరణ్, సుకుమార్ ల మధ్య దూరం పెరిగిందని టాక్.


సాంగ్ రిలీజ్ ప్లాన్ చేసిన చిత్రయూనిట్.. ఓ 2 మినిట్స్ వీడియో కూడా రిలీజ్ చేయాలని చూశారు. చరణ్ అలా ఫిక్స్ అయ్యారట. కాని అనుకున్న టైంకు డిఐ వర్క్ పూర్తి కాకపోవడంతో సుకుమార్ మాములుగానే ఆ సాంగ్ రిలీజ్ చేశారట. అయితే ఈ విషయంలో చరణ్ కాస్త అసంతృప్తి వ్యక్తపరిచాడట.


రిలీజ్ అయిన సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అయితే వీడియో రిలీజ్ చేసి ఉంటే ఇంకాస్త ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదని భావించాడట చరణ్. కాని అలా కుదరలేదట. ఫైనల్ గా ఇప్పుడు తర్వాత సాంగ్ విషయంలో ఇలాంటి మిస్టేక్స్ జరుగకుండా ప్లాన్ చేస్తున్నారట. మార్చి 30న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 


చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సమంత ఇద్దరు విలేజ్ గెటప్ లో అదరగొడుతున్నారు. చరణ్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా వస్తున్న ఈ రంగస్థలం మూవీ చెర్రి కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. ధ్రువ తర్వాత చరణ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: