రేపువిడుదల కాబోతున్న ‘మనసుకు నచ్చింది’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మహేష్ ముఖ్య అతిధిగా హాజరై ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకు రావడానికి తన వంతు సహాయాన్ని తన సోదరి దర్శకురాలు మంజులకు అందించాడు. ఈమూవీకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన నేపధ్యంలో మహేష్ ఇన్వాల్మెంట్ తో మనసుకు నచ్చింది మూవీకి మంచి బ్రేక్ వస్తుందని మహేష్ సోదరి మంజుల భావిస్తోంది. 
 ముఖ్య అతిధిగా మహేష్
ఎంతో ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ తన సోదరి మంజుల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్  చేసాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈమ   ట్రైలర్ తనకు నచ్చింది అని చేపుతూ  తనకొడుకు గౌతమ్ ఈమధ్య తనను మంజుల ఆంటీ దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తావు అని అడిగిన విషయాన్ని బయట పెట్ట్టాడు. అయితే తన కొడుకు అడిగిన ప్రశ్నకు మాహేశ్ తానూ ఇచ్చిన సమాధానం కూడా బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.  తాను మంజుల సినిమాలో నటించవలసి వస్తే అది  ఆఖరి చిత్రం అవుతుందని మహేష్ సరదాగా జోక్ చేస్తూ ఇదే విషయాన్ని తన సోదరితో కూడ చెప్పిన  విషయాన్ని లీక్ చేసి అందరికీ నవ్వు తెప్పించాడు. 
 అదే ఆఖరి సినిమా
ఇదే సందర్భంలో మహేష్ తన సోదరి  మంజుల గురించి మాట్లడుతూ ఆమె కాగితంపై రాసుకుంటుంటే ఏదో కవిత్వం అయి అంటుంది అని భావించానని  అయితే ఆ తర్వాత అది  సినిమా కథ అని తెలిసి తానూ షాక్ అయ్యాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు మహేష్. అయితే అన్ని జోక్ ల తరువార్త మరో ట్విస్ట్ ఇస్తూ తాను ఏదో ఒకరోజు తన సోదరి దర్శకత్వంలో నటిస్తానని చెప్పి మహేష్ మంజులకు జోష్ ను కలిగించాడు. 
 తప్పకుండా నటిస్తా
ఒక క్యూట్ లవ్ స్టొరీ గా రేపు విడుదల అవుతున్న ఈ సినిమా సక్సస్స్ పై భారీ అంచనాలు మంజుల పెట్టుకున్న మంజుల ఆశలను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు గట్టు ఎక్కిస్తారో చూడాలి.  హీరో సందీప్ కిషన్ కు హిట్ ఆనేది వచ్చి చాలా సంవత్సరాలు అయిన నేపధ్యంలో మంజుల సందీప్ కిషన్ ల ప్రయత్నాలకు ఎంతవరకు మచి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: