టాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి టైమ్ అస్సలు బాగాలేదనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా సపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ సినిమా భారీ అంచనాల మద్య రిలీజ్ అయినా..అది కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. దీంతో మరోసారి తన అదృష్టాన్నిపరీక్షించుకోవడానికి కొరటాల నే నమ్ముకున్నాడు.  వీరి కాంబినేషన్ లో ఇప్పడు 'భ‌ర‌త్ అనే నేను' సినిమా చేస్తున్నారు.

ఇది వేస‌విలో తెర‌పైకి రానుంది. దీని త‌రువాత వంశీ పైడిప‌ల్లి సినిమా చేయ‌నున్నారు మ‌హేష్‌. అయితే ఎప్పుడూ పెద్ద దర్శకులకు మాత్రమే చాన్స్ ఇచ్చే మహేష్ ఇప్పుడు చిన్న దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నాడు.  'అర్జున్ రెడ్డి'తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.  కొత్త ద‌నం కోరుకునే ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల‌నే కాదు.. ఎంతో మంది సెలబ్రిటీల‌ను ఈ సినిమా ఆక‌ట్టుకుంది. ఈ సినిమా మ‌హేష్‌కు ఎంతో నచ్చిందట..దాంతో  ఇప్పుడు దీప్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

తాజాగా.. ఈ సినిమాకి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో మ‌హేష్ మెకానిక్ పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నార‌ట‌. హేశ్ బాబు కారు మెకానిక్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా కంటెంట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.  త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ రానుంది. ఈ లోపు 'అర్జున్ రెడ్డి' హిందీ వెర్ష‌న్ పూర్తి చేసేందుకు సందీప్ ప్లాన్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: