వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెర్రంగేటం చేసిన రకుల్ చేసిన తన మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేయడంతో పాటు ఆ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత  తెలుగులో వరస పెట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేస్కుంటూ టాలీవుడ్ లో  హీరోయిన్ గా తనదైన ముద్రవేసింది రకుల్ ప్రీత్ సింగ్ . అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది.


ఇక 2017 రకుల్ కి పెద్ద డిజాస్టర్ నే మిగిల్చిందని చెప్పవచ్చు. ఆఖరికి స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన స్పైడర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఇక అప్పటి నుండి ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే తన మకాంని బాలీవుడ్ కి మార్చేసింది. నీరజ్ పాండే దర్శకత్వంలో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా ఐయారి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.


కాగా ఐయారి సినిమాను చిత్ర బృందం నేడు విడుదలచేసింది. సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర బృందం తిరగని ప్లేసులేదు , చేయని కార్యక్రమం లేదు. అయితే అవన్నీ ఇప్పుడు వృథా అయ్యాయి. ఎందుకంటే ఆ సినిమా పూర్తిగా నెగటివ్ టాక్ తెచ్చుకొని నడుస్తుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి బాలీవుడ్లో పాగా వేద్దామనుకున్న రకుల్ కి భారీ దెబ్బపడింది. ప్ర‌స్తుతం ర‌కుల్ అజ‌య్ దేవ‌గ‌ణ్ సినిమాలో న‌టిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ ని మరచిపోయిందన్న వార్తలూ వస్తున్నాయి. ఇక అజయ్ సినిమా కూడా చతికిలపడితే అంతే! అక్కడ షూటింగ్ అవగానే అన్నీ సర్దుకుని ఇక్కడికి వస్తేనే బావుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: