టాలీవుడ్, కోలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా దానికో ప్రత్యేకత ఉంటుంది. అలాగే దానిలో ఏదో ఒక వివాదామూ ఉంటుంది. అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్‌లు, లఘు చిత్రాలు తీస్తున్న వర్మ.. తాజాగా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది మియా మాల్కోవా స్వగతమని చెబుతూ వచ్చారు. అంతే కాదు ఈ సినిమా  రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలని చూశారు.  ఆ సమయంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా కొన్ని టీవి చానల్స్ లో కొంత మంది మహిళలపై అసభ్యంగా మాట్లాడారని ముఖ్యంగా సామాజిక కార్యకర్త దేవిపై తప్పుడు మాటలు మాట్లాడారని ఫిర్యాదులు వచ్చాయి.

జీఎస్టీ సినిమాపై టీవీ చర్చలో భాగంగా సామాజిక కార్యకర్త దేవిపై చేసిన వ్యాఖ్యలపై వర్మ స్పందించారు. జీఎస్టీపై నమోదయిన కేసులపై సీసీఎస్ స్టేషన్‌లో విచారణకు హాజరయిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం జరిగిన టీవీ చర్చలో పాల్గొన్న వర్మ.. దేవిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. నిజంగా తన వ్యాఖ్యలకు ఆమె మనోభావాలు దెబ్బతింటే సారీ అని వర్మ చెప్పారు. చర్చలో భాగంగా అలా మాట్లాడానే తప్ప ఆమెను కావాలని అన్న మాటలు కావని వర్మ తెలిపారు. "రామ్‌గోపాల్ వర్మ ల్యాప్‌టాప్ సీజ్ చేశాం. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించాం. పోలాండ్, యూకేలో జీఎస్టీ చిత్రీకరణ జరిగిందని వర్మ తెలిపారు.

ఆయన పోలాండ్, యూకే వెళ్లడంపై విచారణ చేస్తున్నాం. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వర్మ సమయం కోరారు. వచ్చే శుక్రవారం మళ్లీ విచారణకు రావాలని వర్మకు చెప్పాం. సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదుపైనా వర్మను ప్రశ్నించాం. టీవీ చర్చలో భాగంగానే మహిళపై వ్యాఖ్యలు చేశానని వర్మ సమాధానమిచ్చారు. జీఎస్టీ సినిమాను తాను తీయలేదని వర్మ తెలిపారు. జీఎస్టీ సినిమా కథ(కాన్సెప్ట్‌) మాత్రమే తనదని వర్మ పేర్కొన్నారు..." అని రఘువీర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: