యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ అంటూ తీసి హిట్ అందుకున్న పవర్ డైరక్టర్ బాబి తన తర్వాత సినిమా ఎవరితో తీస్తాడన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. పవర్ తో డైరక్టర్ గా మారిన కె.ఎస్. రవింద్ర అలియాస్ బాబి ఆ తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ తో డిజాస్టర్ కొట్టాడు. అయితే ఫ్లాప్ ఇచ్చినా సరే తను చెప్పిన కథ నచ్చడంతో జై లవ కుశ ఛాన్స్ ఇచ్చాడు తారక్.


ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం చూపించిన జై లవ కుశతో బాబి అదిరిపోయే హిట్ కొట్టాడు. 2017 దసరాకి వచ్చి దమ్ము చూపించిన బాబి 5 నెలల తర్వాత తన తర్వాత సినిమా ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. ఈమద్యనే నాగ చైతన్యకు కథ చెప్పిన బాని ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట.


ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేశాక తర్వాత అదే రేంజ్ ఉన్న స్టార్ తో సినిమా తీస్తాడని అనుకుంటే.. స్టార్స్ అంతా బిజీ షెడ్యూల్ తో బిజీగా ఉండగా అక్కినేని హీరోతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు బాబి. ఈ సినిమా కథ కథనాల్లో కొత్తదనం ఉంటుందట. అంతేకాదు సినిమాతో చైతుని మేకోవర్ ఉంటుందని తెలుస్తుంది.


మొన్నామధ్య బాబి పవర్ హీరో రవితేజతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే రవితేజ రెండు సినిమాల తర్వాత కాని బాబితో చేస్తాడట. అందుకే ఈలోగా చైతు సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా మారుతి శైలజ రెడ్డి అల్లుడు సినిమా కూడా లైన్ లో పెట్టాడు. మరి బాబి సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: