ఈ మద్య బాలీవుడ్ భామల్ సీక్రెట్ గా కొంత మంది..పెద్దల సమక్షంలో మరికొంత మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల జోరు పెరగడంతో..సీనియర్ హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్నారు. కొద్ది కాలంగా ప్రేమలో ఉంటున్న విరాట్-అనుష్క లు సైలెంట్గా మ్యారేజ్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు. ఇక దీపికా పదుకొణే - రణ్వీర్ సింగ్ , టైగర్ ష్రాఫ్- దిశా పఠానీ, నయనతార- విఘ్నేష్, శృతి హాసన్- మైకెల్ కోర్సలే జంటలు ప్రస్తుతం ప్రేమాయణం మునిగి తేలుతున్నాయని వీరు కూడా త్వరలో పెళ్లి పీటెలక్కనున్నారని కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అమీ జాక్సన్ డేటింగ్లో ఉన్నారా?. ఆమె ఇన్స్టా ఫొటోలు ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి. తెలుగులో రాంచరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన ‘ఐ’ సినిమాలో నటించింది. బ్రిటిష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి జార్జ్ పనయిటోతో అమీ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పలు బిజినెస్లు చేస్తున్న జార్జికి లగ్జరీ హెటల్స్ కూడా ఉన్నాయి.
త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కూడా సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరు రూమర్స్పై స్పందించకుండా సైలెంట్గా మ్యారేజ్ చేసుకొని షాక్ ఇస్తారా అనే అభిప్రాయం జనాలలోను ఉంది. శంకర్ ఐ చిత్రం లో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఇప్పుడు ప్రస్తుతం 2.0 లో నటిస్తున్న విషయం తెలిసిందే.