మెగా మేనళ్లుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరం తేజ్ వరుసగా రెండు హిట్లు కొట్టేసరికి మెగా ఫ్యాన్స్ అభిమానం సంపాదించాడు. అయితే తిక్క నుండి ఈ హీరో ఫ్లాపులు కొనసాగుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇంటిలిజెంట్ కూడా ఫ్లాప్ అవడంతో తేజూ కెరియర్ సందిగ్ధంలో పడింది. వినాయక్ లాంటి క్రేజీ డైరక్టర్ తో సినిమా అంటే అంచనాలు ఉంటాయి కాని సినిమా చూస్తే ఇదేం సినిమారా బాబోయ్ అనేలా చేశారు.


కాలం చెల్లిన కథను.. అదే తీరున కథనం కూడా కొనసాగించి ఫ్లాప్ అందుకున్నారు. ఈ సినిమా బిజినెస్ లో 20 శాతం కూడా రికవర్ కావడం కష్టమే అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత విన్నర్ డైరక్టర్ గోపిచంద్ మలినేని సినిమా చేయాల్సి ఉన్నా ఇంటిలిజెంట్ ఫ్లాప్ తో ఆ సినిమా నిర్మించాలనుకునే నిర్మాత హ్యాండ్ ఇవ్వడంతో సినిమా క్యాన్సిల్ అయ్యిందట.


నిర్మాత ఇలా సడెన్ గా హ్యాండ్ ఇవ్వడానికి కారణం తేజూ మార్కెట్ దెబ్బతినడమే అని తెలుస్తుంది. సినిమా రిలీజ్ ముందు హంగామా ఎలా ఉన్నా రిలీజ్ తర్వాత మాత్రం తేజూ నడిపించలేకపోతున్నాడు. అందుకే సాయి ధరం తేజ్ సినిమా అంటే సరీ అనేస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం కరుణాకరణ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. 


ఈ సినిమా తర్వాత చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందట. ఈ రెండు సినిమాలు హిట్లు కొడితే తప్ప మళ్లీ తేజూ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. కథల విషయంలో తేజూ ఇంకాస్త దృష్టి పెట్టాలని వచ్చిన క్రేజ్ అంతా ఫ్లాపులతో పోగొట్టుకుంటున్నాడని అంటున్నారు. మరి కరుణాకరణ్, యేలేటి సినిమాలైనా మెగా మేనళ్లుడికి హిట్లు ఇస్తాయో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: