టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపాన్ని ప్రకటించారు.  ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. గుండు హనుమంతరావు భౌతికాయానికి నివాళ్ళు అర్పించిన తర్వాత అయన మాట్లాడుతూ....గుండుతో తన అనుబంధాన్ని ఎన్నటికి మరిచిపోలేనని అన్నారు.

మాయలోడు, పేకాట పాపారావు, హై హై నాయక , కొబ్బరిబొండం వంటి సినిమాల్లో తాము కలసి నటించామని, తానూ హీరోగా చేసిన దాదాపు 50 సినిమాల్లో గుండు హనుమంతరావు నటించి మెప్పించారని అన్నారు.భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో రోజు చనిపోతారు. కానీ గుండు హనుమంతరావు ఇంత త్వరగా తమని వదిలి వెళ్తాడని అనుకోలేదు" అని రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
Related image
 'నా ద్రురదృష్టం...నాతొ పాటు ఏవిఎస్, ధర్మవరపు సుభ్రహ్మణ్యం, ఎం.ఎస్ నారాయణ వంటి వారిని నేను కోల్పోయాను. ఇవాళ మరొక నా సోదరుడు వంటి వాడ్ని కోల్పోయాను. అందరమూ వేల్లిపోవాల్సిందే. ఇక్కడ ఎవరు పర్మినెంట్ కాదు. కాకపోతే ఒక మనసుకు నచ్చిన వ్యక్తి గుండు హనుమంతరావు. నటుడిగా కన్నా మంచి వ్యక్తిగా నాకు తెలుసు' అని భావోద్వేగానికి లోయన్నారు రాజేంద్రప్రసాద్.



మరింత సమాచారం తెలుసుకోండి: