దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినది ఇలియానా. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి టాలీవుడ్ పరిశ్రమలో ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడ ఓ రెండు మూడు సినిమాల్లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది పరిశ్రమపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘‘నేను టాలీవుడ్లో మొదటిసారి సెట్స్పైకి వచ్చినపుడు నా నడుముపై శంఖం వేసి సన్నివేశాన్ని షూట్ చేశారు. ఇలా చేస్తున్నారేంటి అని దర్శకుడిని అడిగితే.. ‘నీ నడుము బాగుంది.
ఈ సన్నివేశం షూట్ చేస్తే ఇంకా బాగుంటుంది’ అన్నారు. ఇలా నడుముపై తెరకెక్కిస్తున్న ప్రతీ సన్నివేశంలో అదే మాట చెప్పేవారు. అటువంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని, దక్షినాది పరిశ్రమ ఇంకా మారలేదని చెప్పుకొచ్చింది ఇలియానా. ప్రస్తుతం ఆమె.. అజయ్ దేవగణ్తో కలిసి ‘రెయిడ్’ అనే సినిమాలో నటిస్తోంది.
సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇలియానా తన అభిప్రాయాలు ఇలా షేర్ చేసుకుంది. దేవదాసు సినిమా తర్వాత ఇలియానా కు వరుస హిట్స్ వచ్చాయి. తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి..ఆ మద్య ఐటమ్ సాంగ్ తో అయినా ఎంట్రీ ఇవ్వాలని చూసినా అదీ కుదరలేదు.