టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఎనిమిది సంవత్సరాలు ఉన్న విషయం తెలిసిందే. శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల వైపు వెళ్లారు..దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. వివివినాయక్ దర్శకత్వంలో.. రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో ప్రభంజనం సృష్టించారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో షూటింగ్ రెండవ షెడ్యూల్ అవుతుంది..ఇక ‘సైరా’ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమితాబ్ పాత్రకు, సినిమా కథకు సంబంధించిన చర్చల్లో భాగంగా ఇటీవల సురేందర్ రెడ్డి ఆయణ్ని కలిశారు.
ఈ సందర్భంగా బిగ్ బీతో కలిసి సురేందర్ రెడ్డి దిగిన ఫోటో ఆన్లైన్లో వైరల్గా మారింది.స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ‘సైరా’ సినిమా తెరకెక్కిస్తున్నారు. మెగస్టార్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్, సుదీప్, విజయ్సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం కానుంది.