టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో సంచలన చిత్రాలు తెరకెక్కించిన సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ ఈ మద్య పలు వివాదాలకు కేంద్రబింధువుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.  సోషల్ మీడియాలో వర్మ ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఈ మద్య `గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌` పేరిట తీసిన న్యూడ్ సినిమాపై పలు వివాదాలు మూటగట్టుకున్నారు.  ఈ సినిమా రిలీజ్ కి ముందు కొన్ని ఛానల్స్ లో ఆయన మాట్లాడిన తీరు మహిళలను ఇబ్బందులు పెట్టిందని..ఇలాంటి సినిమాల వల్ల యువత చెడిపోతుందని సామాజిక కార్యకర్త దేవి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాపై రాంగోపాల్ వర్మ ఫైర్..!
అయితే దేవి చేసిన కామెంట్స్ పై వర్మ వల్గర్ గా మాట్లాడంతో..ఆమె పోలీసు కేసు పెట్టింది.  ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన వర్మ ఎట్టకేలకు శనివారం నాడు విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన అడ్వొకేట్ కూడా వచ్చారు.  మొత్తానికి సామాజిక కార్యకర్త దేవికి సారీ చెప్పడంతో వివాదం ముగిసిందనుకున్నారు. కానీ తెరపైకి మరో వివాదం వచ్చింది.

మీడియాపై రాంగోపాల్ వర్మ ఫైర్..!
హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణ తరువాత, మీడియాలో వస్తున్న వార్తలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.జీఎస్టీ చిత్రాన్ని తాను తీయలేదని, స్క్రిప్టును మాత్రమే ఇచ్చానని పోలీసులకు చెప్పానని పలు వార్తా చానళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాన్ని ఖండిస్తున్నట్టు చెప్పాడు.  తాను సినిమా నిర్మాణంలోనూ భాగస్వామినేనని చెప్పాడు.  సినిమాకు తాను సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇచ్చానని ఎలా రాస్తారని ప్రశ్నించాడు.   
మీడియాపై రాంగోపాల్ వర్మ ఫైర్..!
తాజాగా తెలుగు టీవీ చానల్ 'టీవీ9'పై క్రిమినల్ కేసు పెట్టనున్నట్టు ఈ ఉదయం వెల్లడించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, మరో ట్వీట్ పెడుతూ ఆ చానల్ యాంకర్ రజనీకాంత్ పై నిప్పులు చెరిగాడు. నిజాలను నాశనం చేస్తూ, ఆయన తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేయిస్తున్నారని ఆరోపించాడు. అసత్యాలను ప్రసారం చేస్తూ, తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: