తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి నెంబర్ వన్ రేసులోకి వెళ్లింది. ఈ చిత్రంలో నటించిన సహనటుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం సమంత-చైతూ హనీమూన్ ట్రిప్ పూర్తి అయిన వెంటనే మూవీ షూటింగ్స్ లో బిజీగా గుడుపుతున్నారు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తుంది సమంత. తర్వాత విజయ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గానే కాకుండా ప్రొడ్యూసర్ అవతారం కూడా ఎత్తబోతుంది. కన్నడంలో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన యూ టర్న్ మూవీని తెలుగు, తమిళంలో రిమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రాజమహేంద్రవరంలో జరుగుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్లో భాగంగా సమంత స్కూటీపై చక్కర్లు కొడుతోంది.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అయితే యూ టర్న్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ పవన్ కుమార్..రిమేక్ చిత్రాలకు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు.
సమంత నటించిన రంగస్థలం మూవీ షూటింగ్ కూడా రాజమహేంద్రవరంలో జరిగింది. ఇక్కడి వాతావరణం తనకు చాలా బాగా నచ్చినట్లు సమంత చెప్పిన విషయం తెలిసింది. ప్రస్తుతం సమంత షెడ్యూలు చాలా బిజీగా ఉంది..ఇప్పుడు ‘మహానటి’ మూవీ షూటింగ్స్లోనూ బిజీగా గడుపుతున్నారు సమంత.