రజనీకాంత్‌ హీరోగా రూపొందిన యానిమేషన్‌ మూవీ ‘కొచ్చాడయాన్’ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. తాజాగా  రజనీకాంత్ భార్య లతకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఏడీ బ్యూరో ప్రైవేట్ కంపెనీకి రెండు వారాల్లో రూ.6.2 కోట్లు చెల్లించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.  ‘కొచ్చాడయాన్’   సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల కోసం నిర్మాణ సంస్థ మీడియా వన్‌కు యాడ్ బ్యూరో కంపెనీ పది కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ సమయంలో రజనీ భార్య లతా రజనీకాంత్‌ హామీ సంతకం చేశారు. 
Image result for kochadaiyaan rajini
ఈ రుణానికి సంబంధించి కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించిన చిత్ర యూనిట్‌ మిగతా మొత్తాన్ని ఇంతవరకు చెల్లించలేదు. అనుకున్నదానికంటే ఈ సినిమాను దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమా పూర్తయ్యాక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు డబ్బు సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
Related image
కొచ్చాడయాన్‌ టీం నుంచి స్పందన రాకపోవటంతో యాడ్‌ బ్యూరో కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం షూరిటీగా ఉన్న లతా రజనీకాంత్‌ను పన్నెండు వారాల్లోగా 6.2 కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా ఆదేశించింది.  కొచ్చాడయాన్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, సీనియర్‌ హీరోయిన్‌ శోభనలు హీరోయిన్లుగా కనిపించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: