పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత చాలా సార్లు చెప్పిన మాట నా దగ్గర డబ్బులు లేవు. అందుకే కొన్ని సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తి కరమైన న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్లినా అక్కడి కార్యక్రమాల నిర్వహణకు దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుంది , అంత ఎందుకు జనసేన పార్టీ ఆవిష్కార సభకు , విశాఖపట్నంలో సభకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు అయినట్టు అంటారు.
ఇవన్నీ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ కి డబ్బులు ఎక్కడినుండి వచ్చాయి అని అందరూ అడుగుతున్నారు. ఈ సందర్భంగానే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ కి రియల్ ఎస్టేట్ ద్వారా కూడా కొంత వరకు లాభం చేకూరినట్టు సమాచారం. పార్టీ కోసం ఎంతో కొంత సేకరించడానికి సినిమా కన్నా తేలికైన రంగం , రియల్ ఎస్టేట్ అన్న విషయం పవన్ కళ్యాణ్ కి తెలుసు.
దానికి తోడు పవన్ కి బొత్స సత్యనారాయణ తో , బండ్ల గణేష్ తో , మరికొందరు భారీ నాయకులతో మంచి అనుబంధం మొదటి నుండి ఉంది. పివిపి తో కలిసి అప్పట్లో విజయవాడ నుండి అతనికి టికెట్ ఇప్పించడానికి చాలా ప్రయత్నం చేసాడు. తరువాత వీరిద్దరూ విడిపోయినా , దానికి ముందు కొంత వరకు రియల్ ఎస్టేట్ లో మొదటి సారి పాఠాలు నేర్చుకున్నాడు అంట. అందుకే పవన్ కళ్యాణ్ , రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పరోక్షంగా కాలు పెట్టి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా అమరావతి ప్రాంతం దగ్గర ఇద్దరు మంత్రుల సహాయంతో కొంత వరకు భూమిని సొంతం చేసుకున్నట్టు, అలానే
హైదరాబాద్ పరిసరాల్లో కూడా మూడు చోట్ల పవన్ కళ్యాణ్ కి బిల్డింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు చెబుతున్నారు.