తెలుగు వాడు అంటే ఇదీ,తెలుగు వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించిన ఘనత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికే దక్కుతుంది. దేశంలో ఎన్ని సినిమా ఇండస్ట్రీలు ఉన్నా తెలుగు సినిమా పరిశ్రమను,తెలుగు నటులను గౌరవిస్తున్నారంటే ఆనాడు రామారావు గారు వంటి పెద్దలు చేసిన కృషి అని చెప్పవచ్చు. సినిమాలనుండి మొదలైన ఆయన ప్రస్థానం ఆ తరువాత రాజకీయాల వరకు ఆయన ఎదిగిన వైనం అందరికీ ఆదర్శప్రాయమే.


అందుకే ఆయన జీవితంలో జరిగిన ఎత్తుపల్లాలను, సుఖదుఃఖాలను తెలియజేయడానికి బయోపిక్ ను నిర్మిస్తున్నారు. బాలయ్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. బయోపిక్ కు సంబంధించి టైటిల్ పోస్టర్ను గత నెల చివర్లో విడుదలచేసిన విషయం తెలిసిందే. కాగా బయోపిక్ కు సంబందించిన పాత్రల కోసం ఎంపికలు జరుగుతున్నాయి.


ఆ మహానటుడి భార్య అయిన బసవతారకం గారి పాత్ర కోసం నిత్యామీనన్ ని ఎంపిక చేశారట దర్శకుడు తేజ. ఇదే విషయంపై ఆమె దగ్గరకి వెళ్లి సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించారట. ఆ పాత్రను తిరస్కరించడానికి ఎటువంటి వివాదాలు లేవని మీడియాకు తెలిపింది నిత్యా. అయితే ఎందుకు రిజెక్ట్ చేసిందో వివరించలేదు కాని చిత్ర యూనిట్ కు మాత్రం తెలిపిందట. కాగా "అ!"సినిమాలో విభిన్న పాత్రను చేసిన నిత్యా ప్రస్తుతం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: