నందమూరి వరసులుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నందమూరి కళ్యాణ్ ఎవరికి వారు తమ కెరియర్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నందమూరి హీరోలంతా కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరిక. అయితే ఆ కల ఈ ఇయర్ నెరవేరబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ, నా నువ్వే సినిమాలతో బిజీగా ఉన్నాడు.


ఈమధ్యనే పవన్ సాధినేని చెప్పిన కథకు ఫిదా అయిన కళ్యాణ్ రాం ఆ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఫాంటసీ కథగా రాబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, హరికృష్ణలు కూడా నటించే అవకాశాలు ఉన్నాయట. అయితే నందమూరి మల్టీస్టారర్ అంటే బాలయ్య కూడా ఉండాలి కదా అంటే ప్రస్తుతం బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించరని తెలుస్తుంది.


ఇక నందమూరి మనం గా రాబోతున్న ఈ సినిమాపై మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి. ఇదవరకు నారా రోహిత్ తో సావిత్రి సినిమా చేసిన పవన్ సాధినేని నందమూరి మల్టీస్టారర్ షురూ చేయడం సర్ ప్రైజింగ్ గా ఉంది. ఇప్పటికే ఈ కథ ఎన్.టి.ఆర్ కూడా విన్నాడని.. కథ బాగా రావడం వల్లే నందమూరి హీరోలు ఒప్పుకున్నారని తెలుస్తుంది.


ఇక ఎన్.టి.ఆర్ ప్రస్తుతం త్రివిక్రం సినిమాకు సిద్ధమవుతున్నాడు. మార్చి నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా కూడా లైన్ లో ఉంది. ఆ సినిమాకు ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా చేయాల్సి ఉందట. మొత్తానికి బిజీ షెడ్యూల్ తో స్టార్స్ అంతా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు కష్టపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: