ఈ సమ్మర్ కు ఓకే రోజు మహేష్, అల్లు అర్జున్ లు పోటీపై రకరకాల వార్తలు వస్తున్నాయి. మహేష్ భరత్ అనే నేను, బన్ని నా పేరు సూర్య రెండు సినిమాలు ఏప్రిల్ 27న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే ముందు మా సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేశాం అంటే మా సినిమా అంటూ గొడవపడుతున్నారు. 


దర్శక నిర్మాతలు ఎంత కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నాలు చేసినా కుదరలేదని తెలుస్తుంది. మహేష్ భరత్ అనే నేను ఒకరోజు ముందుకు జరిగి ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అయితే నా పేరు సూర్య కూడా ఏప్రిల్ 26కి వస్తుందని అంటున్నారు. ఈ ఇద్దరి పోటీ ఇండస్ట్రీకి సైతం మంచిది కాదని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.  


రెండు సినిమాల్లో ఒక దాని రిజల్ట్ మరో దాని మీదే పడే అవకాశం ఉంటుంది. అందుకే ఒకటి ముందుకి మరోటి వెనక్కి రిలీజ్ చేయాలని అనుకున్నారు. బన్ని సినిమా అవసరమైతే ముందుకొస్తాం కాని వాయిదా వేసేది లేదని అంటున్నారట. ఇక మే నెల్లో మహేష్ కు బ్యాడ్ సెంటిమెంట్ ఉంది కనుక భరత్ అనే నేను మాత్రం అనుకున్న డేట్ కే వస్తుందట.


మహేష్ వర్సెస్ బన్ని ఫైట్ ఇప్పటివరకు కాంప్రమైజ్ అయ్యే ఆలోచన లేదని తెలుస్తుంది. మరి అనుకున్న డేట్ కు ఎవరు వస్తారన్నది చివరి దాకా తేలదని అంటున్నారు. ఇక ఏప్రిల్ 27న రజినికాంత్ కాలా మాత్రం రిలీజ్ కన్ఫాం చేశారు. అయితే కబాలి కాంబో అయినా రజిని సినిమాకు తెలుగులో అంత బజ్ మాత్రం క్రియేట్ అవలేదు. టీజర్ తో ఏమన్నా క్రేజ్ వస్తుందేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: