టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న నేచురల్ స్టార్ నాని ‘అ!’సినిమాతో నిర్మాతగా మారారు.  అష్టాచమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నానీ తర్వాత సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు..మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో మనోడి దశ తిరిగింది. నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచాయి.  ఎంసీఏ తరువాత నాని తరువాతి సినిమా “కృష్ణార్జునులు”. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది…వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తన అభిమానులకోసం “కృష్ణార్జున సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ మరియు అందులోని ఇక పాటను” రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 
Image result for nani
ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయనున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి నాని తప్పుకున్నాడనేది తాజా సమాచారం.  కాగా, ఈ చిత్రంలో కథ కథనాల్లో కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడట..తనదైన శైలిలో కిషోర్ తిరుమల ట్రై చేసినా నాని సంతృప్తి చెందలేదట .. దాంతో తాను చేయలేనంటూ సున్నితంగా తప్పుకున్నాడని అంటున్నారు. 
Image result for director tirumala kishore
అదే కథను సాయిధరమ్ తేజ్ తో చేయడానికి మైత్రీ మూవీస్ వారు సిద్ధమవుతున్నారట. కథ విన్న వెంటనే సాయిధరమ్ తేజ్ ఒప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. కరుణాకరన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన గోపీచంద్ మలినేనితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత కిషోర్ తిరుమలతో తేజు సినిమా పట్టాలెక్కనుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: