టాలీవుడ్ ఇండస్ట్రీలో నానీ హీరోగా నటించిన ‘అలా మొదలైంది’ సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మళియాళ కుట్టి నిత్యామీనన్ ఆ తర్వాత తమిళ, మళియాళీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత నానితో మరో సినిమాలో నటించిన నిత్యామీనన్ ఈ మద్య రిలీజ్ అయిన ‘అ!’సినిమాలో నటించింది. కొత్తదనం .. ప్రాధాన్యత కలిగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆమె తన క్రేజ్ ను నిలువుకుంటోంది.
తాజాగా ఆమె 'ప్రాణ' అనే ఓ బహుభాషా చిత్రంలో నటించింది. మలయాళ.. కన్నడ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఏక కాలంలో నిర్మించారు. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమాలో ఒకే ఒక క్యారెక్టర్ ఉండబోతుందట..నిత్య మీనన్ ఆ పాత్రకు ప్రాణం పోసిందట. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది..కె. ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
సౌండ్ డిజైనింగ్ ఈ సినిమా ప్రత్యేకతని చెబుతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి ఈ సినిమాకి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మొదటిసారిగా ఈ సినిమా కోసం 'సరౌండ్ సింక్ సౌండ్ టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్నారు. సహజసిద్ధంగా నేపథ్యం సంగీతం, డైలాగ్స్ రికార్డు అవుతుంది అని ఆమె చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫస్ట్లుక్లో నిత్యామినన్ ఇంటెన్స్ లుక్స్ ఆ సినిమా స్టామినాను చెప్పకనే చెబుతున్నది. ఈ ఫస్ట్లుక్కు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తున్నది.