మళియాళీ ముద్దుగుమ్మ  కీర్తి సురేష్ నటించిన తొలి చిత్రం నేను శైలజ.  తొలి చూపులోనే తెలుగు ఆడియన్స్ ఈమెకు ఫిదా అయిపోయారు. నేను లోకల్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్ ఆ తర్వాత పవన్ కళ్యాన్ నటించిన  ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో సందడి చేసింది.  చూడగానే ఆకట్టుకునే రూపం ఆమె సొంతం. నటన పరంగా కూడా కీర్తి సురేష్ శభాష్ అనిపించుకుంది. అందాల హద్దులు దాటని ఈ భామకు భారీ అభిమానులు ఉన్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది.
 స్టార్ హోదా వలనే
ఇక తమిళ సినిమాల విషయానికొస్తే, అక్కడి అగ్రకథానాయకులతో వరుస సినిమాలు చేస్తోంది.  బొద్దుగా వుండే ఈ భామకి అవకాశాలు వరుసబెట్టి వస్తున్నాయి.  కీర్తి సురేష్ గురించి కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఓ వార్త షాక్ కి గురిచేస్తోంది. కానీ ఇది నిజం అని నొక్కి మరి చెబుతున్నారు. సెట్స్ లో ఆమె బిహేవియర్ ఇందుకు కారణం అని అంటున్నారు.

ఈ మద్య కీర్తి సురేష్   కోలీవుడ్ లో మాత్రం కొన్ని వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ సీనియర్ నటుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లు సమాచారం. షూటింగ్ లో క్యార్ వాన్ నుంచి ఒక పట్టాన బయటకు రాదట. కీర్తి కోసం దర్శకుడి నుంచి సీనియర్ నటుల వరకు ఈ అమ్మడి గురించి పడిగాపులు కాసే పరిస్థితి వస్తుందట.  షూటింగుకి ఉదయాన్నే వచ్చేస్తుందట .. కానీ కారవాన్ లో నుంచి ఒక పట్టాన బయటకి రాదట.
 బంపర్ ఆఫర్ కొట్టినా
మేకప్ విషయంలో ఆమె తీసుకునే అతి జాగ్రత్తే ఇందుకు కారణమని అంటున్నారు. చిన్న షాట్ కి కూడా హెవీగా మేకప్ చేసుకుని గాని ఆమె కారవ్యాన్ దిగదని చెబుతున్నారు.  కీర్తి ఇలా ప్రవర్తించడానికి కారణం ఆమెలో స్టార్ హీరోయిన్ అనే భావన పెరిగిపోవడం వల్లనే అని కోలీవుడ్ వర్గాలు విమర్శలు గుపిస్తున్నాయి. మరి ఈ ప్రచారం పట్ల కీర్తి ఎలా స్పందిస్తుందో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: