రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. చిట్టిబాబు సౌండ్ ఇంజినీర్ గా చరణ్ కొత్త లుక్ తో కనిపించాడు.


ఇక రామలక్ష్మిగా సమంత కూడా సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమా రిలీజ్ హంగామా మొదలు పెట్టగా కొన్ని సీన్స్ ఎందుకో అనుకున్నత విధంగా రాలేదని చెప్పి రీషూట్ చేస్తున్నారట. ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియదు కాని రంగస్థలం రీ షూట్స్ కంపల్సరీ అంటున్నారు. చెర్రి, సుకుమార్ ల మధ్య ఈ విషయం మీదే కాస్త డిస్టన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.


సినిమాకు హైలెట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ అటు ఇటుగా వచ్చాయట. అందుకే మళ్లోసారి వాటిని రీ షూట్ చేయాలని అనుకుంటున్నారట. అదే జరిగితే అనుకున్న టైం కల్లా రిలీజ్ కష్టమని అంటున్నారు. ఇక ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తిగానే ఉన్నాడని అంటున్నారు.


మరి అఫిషియల్ గా చిత్రయూనిట్ ఎనౌన్స్ చేస్తే తప్ప ఈ వార్తలపై నమ్మకం కుదరదు. ఇప్పటికే మార్చిలో స్టార్ సినిమాల కొట్లాట జరుగుతుంటే ఇప్పుడు చరణ్ కూడా వారికి పోటీగా వచ్చేలా ఉన్నాడు. రంగస్థలం అనుకున్న డేట్ కు వస్తుందా లేక వాయిదా పడుతుందా అన్నది త్వరలో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: