ఓవర్ నైట్లోనే యూట్యూబ్లో సంచలనంగా మారిన ప్రియా ప్రకాశ్ వారికర్ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నది. మూడు రోజుల్లోనే సామాజిక మాధ్యమాల్లో సూపర్స్టార్లకు మించిన క్రేజ్ వచ్చింది. 11వ తేదీన విడుదలైన ఓరు ఆదార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవీ పాటలో కన్నుగీటి కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది. ఓర చూపులతో కుర్రాళ్ళ గుండెల్లోకి బాణం దించిన ఈ 18 ఏళ్ళ అమ్మాయి త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.
ఒరు ఆదార్ లవ్ సినిమాలోని ఓ పాటలో ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇస్లాం మతాన్ని అవమానించేలా నటించారని తెలంగాణ, మహారాష్ట్రల్లో కేసులు నమోదయ్యాయి. వీటిపై సినిమా నిర్మాత, దర్శకుడు, నటులు సుప్రీంను ఆశ్రయించారు. కాగా, ఓ మతాన్ని అవమానించారనే ఆరోపణతో ఆమెపై నమోదైన కేసులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
అంతేకాదు ప్రియా వారియర్ తో పాటూ, దర్శకుడు, నిర్మాతలపై దేశ వ్యాప్తంగా ఎక్కడా కేసులు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే..ఈ అమ్మడు రోజురోజుకి ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే సన్నీలియోన్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలని క్రాస్ చేసిన ప్రియా వారియర్ తాజాగా ఫేస్బుక్ సృష్టికర్త జుకర్బర్గ్ని మించిపోయింది.
ఆయనికి ఇన్స్టాగ్రామ్లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే, ఈ 18 ఏళ్ళ కేరళ కుట్టికి 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ అమ్మడికి పలు సినిమాలలో ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లో నిఖిల్ సరసన నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుండగా , దీనిపై క్లారిటీ రావలసి ఉంది.