కాజల్ పేరు వింటే చాలు.. చందమామ సినిమా గుర్తొస్తుంది. మిగిలిన సినిమాలు ఎన్ని ఉన్నా చందమామతో కాజల్ కు స్టార్ డమ్ వచ్చింది. ఆ తర్వాత మగధీర లాంటి సినిమాలతో ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత అమ్మడికి పెద్దగా టైమ్ కలిసిరాలేదు. తాజాగా అ! సినిమాతో మళ్లీ చాన్స్ కొట్టింది..
తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు ఆఫర్స్ లేక సతమతమవుతున్న హీరోయిన్ కాజల్. ఏదో చిరుతో జోడి కడితే సీన్ మారింది. రానా సినిమాతో తిరిగి హల్ చల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇంత వరకు ఓకే.. కానీ కాజల్ ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ఎందుకో తెలుసా..?
రెండేళ్ళుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న బ్యూటీ కాజల్. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీ వంద కోట్లు వసూలు చేసినా అందులో హీరోయిన్ కాజల్ అనే విషయమే చాలా మందికి గుర్తు లేదు. దానికన్నా ముందొచ్చిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో ఈ బ్యూటీ కలరింగ్ తో కవ్వించినా ఆ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో ఈ లేడీ కెరీర్ క్లైమాక్స్ కి చేరింది. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి హిట్ అవ్వడంతో తిరిగి ట్రాక్ ఎక్కింది. ప్రజంట్ నాని నిర్మాతగా వచ్చిన అ! మూవీ కూడా ఈ బ్యూటీకి ప్లస్ గా మారింది.
టాలీవుడ్ లో అ! టాక్ కాస్త స్లోగా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం వసూళ్లు రాబడుతుంది. అయినా కాజల్ క్యారెక్టర్ తక్కువ నిడివి ఉండటంతో తన చూపంతా నెక్స్ట్ మంథ్ లో రిలీజ్ కాబోతున్న ఎమెల్యే సినిమా పైనే పెట్టుకుంది. ఇదిలా ఉంటే రెమ్యునరేషన్ విషయంలో కాజల్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదట. తను కోట్ చేసనంత ఇస్తేనే కాల్ షీట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. అందుకే నిర్మాతలు భయపడిపోతున్నారట.
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కే మూవీలో హలో ఫేం కళ్యాణి ప్రియదర్శన్ ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా కాజల్ ని సెలక్ట్ చేశారు. కీలకమైన ఒక ఎపిసోడ్ లో శర్వా లవర్ గా కనిపించే పాత్ర కోసం కాజల్ ను అడిగితే భారీగా డిమాండ్ చేసినట్టు సమాచారం. 30 ప్లస్ లో ఉన్న ఏ హీరోయిన్ కైనా ఆఫర్స్ రావడమే గొప్ప. అలాంటిది ఏదో లక్ కలిసొచ్చి కాజల్ కి ఛాన్స్ లు వస్తుంటే దాన్ని కాస్తా రెమ్యునరేషన్ పెంచేసి చెడగొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటోంది పాపం..