భారతీయ చలన చిత్ర సీమలో రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’ఎన్నో సంచలనాలకు నాంది పలికింది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేయడమే కాదు ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత ఆ రికార్డులు బాహుబలి మాత్రమే చేయగలిగింది. తాజాగా ఈ కాంబినేషన్ లో ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రధారులుగా '2.0' రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులను పూర్తిచేసుకునే పనుల్లో వుంది.
వాస్తవానికి డిసెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా జనవరికి పోస్ట్ పోన్ చేసింది..ఆ తర్వాత ఏప్రిల్ ఇలా వాయిదాలు వేస్తూ వస్తున్న రోబో 2.0 పై రక రకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాకి గ్రాఫిక్స్ చేస్తోన్న సంస్థ దివాళా తీయడంతో, మిగతా వర్క్ ను ఇతర సంస్థలకి అప్పగించారు. ఈ కారణంగా ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో నిర్మాతలు తీవ్రమైన అసహనానికి లోనయ్యారు. ఇలా వాయిదాలు పడుతు వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయాయి. 2.0 చిత్రం ఆలస్యం కారణంగా తాము నష్టాల పాలవుతున్నామనీ .. రిలీజ్ డేట్ చెప్పమని శంకర్ ను నిర్మాతలు ఒత్తిడి చేశారట.
దాంతో దర్శక నిర్మాతల మధ్య వాదన జరిగినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. మొత్తానికి ఈ విషయంలో సినీ పెద్దలు జోక్యం చేసుకొని విభేదాలకు చెక్ పెట్టాలనీ, రిలీజ్ డేట్ ఖరారు జరిగేలా చూడాలని ప్రయత్నిస్తున్నారట.