బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ చేసిన డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమా తరువాత మొన్నటి వరకు రెస్ట్ తీసుకున్న జక్కన్న ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెంచాడు. తారక్, చెర్రీతో తెరకెక్కించే మల్టీస్టారర్ మూవీకి సంబంధించి ఈ ఇద్దరికి స్పెషల్  ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు. దర్శక ధీరుడిగా పేరొందిన రాజమౌళి బాహుబలి తరువాత చేసే ఈ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ ఉత్కంఠ నెలకొంది. దీనికి తగ్గట్టే అద్దిరిపోయే కాంబోను సెట్ చేసుకున్నాడు జక్కన్న. ఎన్టీఆర్, రాంచరణ్ లతో భారీ మల్టీస్టారర్ కి సన్నాహలు చేస్తున్నట్లు క్లారిటీ వచ్చిసింది.

Image result for rajamouli

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జక్కన్న బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వచ్చేశాయి. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని ట్రాక్ లో పెట్టేందుకు జక్కన్న జాగ్రత్త పడుతున్నాడు. టాప్ స్టార్స్ కాంబినేషన్ మూవీ అనగానే అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా పండగ చేసుకుంటున్నారు.

Image result for rajamouli

జక్కన్న తెరకెక్కించే ఈ మల్టీస్టారర్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుందనే మాట వినిపిస్తోంది. అందుకే యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని ప్రయోగాత్మకమైన సన్నివేశాలు ఈ సినిమాలో మెయిన్ గా ఉండబోతున్నాయి. స్క్రిప్ట్ మొత్తం ఇంకా రెడీ అవ్వలేదు గానీ రాజమౌళి విజన్ మాత్రం గొప్పగా ఉంటుందని అందరూ ఫీలవుతున్నమాట. దాని ప్రకారం జక్కన్న కొన్ని సీన్స్ ప్లాన్ చేసుకున్నాడట. కథలో ఆ సన్నివేశాలు కీలకం కావడంతో చెర్రీ, తారక్ కాల్షీట్స్ అనుకున్న సమయానికంటే నెల ముందే ఇవ్వాలని కోరినట్టు తాజా న్యూస్. ఇద్దర్నీ ఈ కేరక్టర్స్ కు ప్రిపేర్ చేయడంకోసం కొంత ట్రైనింగ్ ఇవ్వాలని రాజమౌళి భావిస్తున్నాడట. షూటింగ్ టైమ్ లో ప్రతి సన్నివేశానికి ముందు డీటెయిల్స్ చెప్పడం కంటే కొంత ముందుగానే దీనిపై ట్రైనింగ్ ఇస్తే.. షూటింగ్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చనుకుంటున్నాడట జక్కన్న. ఓవరాల్ గా ఈ ట్రైనింగ్ అంతా పూర్తయ్యి సెట్స్ పైకి వెళ్లడానికి సెప్టెంబర్ డెడ్ లైన్ గా పెట్టుకున్నాడని టాక్.

Image result for rajamouli

ఏదైతేనేం.. రాజమౌళి మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. రాంచరణ్ కు జోడీగా రాశీ ఖన్నాను ఎంచుకున్నట్టు టాక్. ఇక తారక్ జోడీకోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో ముహూర్తం షాట్ కొట్టుకునే ఈ సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకోసం మరోసారి భారీ బడ్జెట్ నే ప్లాన్ చేసుకున్నాడట జక్కన్న. మరి చూద్దాం ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో..!


మరింత సమాచారం తెలుసుకోండి: