టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘బద్రి’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమాలో పవన్ కళ్యాన్ సరసన అమిషా పటేల్, రేణూ దేశాయ్ జంటగా నటించారు.  ఆ తర్వాత ఈ జంట జానీతో మురిపించారు. సినిమాలోనే కాకుండా నిజజీవితంలో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.
Image result for renudeshai pawan
వీరిద్దరిక ఇద్దలు పిల్లు పుట్టిన తర్వాత కొన్ని అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకున్నారు.  కానీ ఇద్దరూ ఎప్పుడూ ఒకరిని ఒకరు విమర్శించుకోలేదు..అంతే కాదు ఇప్పటికీ తన పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు పవన్ కళ్యాన్.  అయితే రేణు దేశాయ్ తన పిల్లలతో పూణేలో ఉంటున్న విషయం తెలిసిందే.  ఈ మద్య బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. 
Image result for renudeshai pawan
తాజాగా  రేణూ దేశాయ్, తన ట్విట్టర్ ఖాతాలో ఓ కవితను చదువుతూ 49 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పెట్టగా, దాన్ని చూసిన అభిమానులు ఫిదా అవుతూ 'సూపర్ వదినా', 'అదిరిపోయింది వదినా' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 'డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్' అనే పేరుతో యూ ట్యూబ్ లో విడుదలైన ఈ కవితలో...


మనసు పొరల్లో సమాధి కాబడిన జ్ఞాపకాలు
వాటిని నేను మళ్లీ మళ్ళీ చూసుకుంటునక్నాను
ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు నా మదిలో చెరిగిపోని రాతలే
ఇప్పటికీ అవన్నీ నా మనసు పొరల్లో జ్ఞాపకాలే
క‌మ్ముకున్న మంచు క‌రిగిపోయి
ఇంకోసారి అవే జ్ఞాప‌కాలు క‌ళ్ళెదుట నిలిచాయి.
విధి ఎంత బ‌లీయమైన‌ది కాకుంటే,
మ‌న‌సులో ఎక్కడో పాతుకుపోయిన
జ్ఞాప‌కాల‌ను ఎందుకు మ‌ళ్ళీ త‌ట్టి లేపుతుంది?
ఆ జ్ఞాప‌కాల‌ని మ‌ళ్ళీ చూసుకుంటే
ఓ తుప్పు ప‌ట్టిన క‌లం, దానితో రాసుకున్న పేరు
ముక్క‌లైన నా హృద‌యం,
నేను రాసుకున్న లేఖ‌ల కాగిత‌పు ముక్క‌లు మాత్ర‌మే కనిపించాయి.
అంటూ తనలోని బాధను రేణూ దేశాయ్ పంచుకుంది. ఈ కవితలో ఎవరి పేరునూ ప్రస్తావించకున్నా, ఆమె కచ్చితంగా పవన్ ను ఉద్దేశించే ఈ కవిత రాసుకుందని నమ్మేస్తున్న ఫ్యాన్స్, రేణు మనసులోని బాధే ఇదని భావిస్తూ, ఆమెను అనునయిస్తూ, ట్వీట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: