టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున వారసులుగా అక్కినేని నాగచైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  జోష్ సినిమాతో పదేళ్ల క్రితం నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన సరైన సూపర్ హిట్ సినిమా లేక పెద్దగా పేరు తెచ్చుకోలేక పోతున్నారు.  ఇక మనం సినిమా క్లయిమాక్స్ లో మెరుపులు మెరిపించిన అఖిల్..వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  కానీ హీరోగా మంచి మార్కులు కొట్టిన అఖిల్ సినిమా మాత్రం హిట్ కాలేదు. 
Image result for akkineni naga chaitanya
ఈ మద్య హలో అంటూ మళ్లీ వచ్చాడు..కానీ అది కూడా పెద్దగా పేరు తీసుకు రాలేదు. దీంతో తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నాడు అఖిల్.  ఇక నాగ చైతన్య ‘ఏం మాయ చేసావే’ సినిమాలో పరిచయం అయిన సమంతను రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  వీరి హనీమూన్ అయిన వెంటనే ఇద్దరు తమ సినిమాల్లో బిజీగా మారిపోయారు.  తాజాగా నాగచైతన్య .. రకుల్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనీ, గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం కానుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Image result for akkineni naga chaitanya samantha
  వీరి కాంబినేషన్ లో రీసెంట్ గా ‘రారండోయ్ సందడి చేద్దాం ’ మంచి విజయం సాధించింది.  ఈ సినిమా కోసం ప్రస్తుతం చైతూ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు. దీనిపై స్పందించిన నాగ చైతన్య ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. ప్రస్తుతం తాను 'సవ్యసాచి'తో పాటు మారుతి  దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని అన్నాడు.
Image result for akkineni naga chaitanya samantha
ఈ రెండు సినిమాలు ఆసక్తికరమైన కంటెంట్ తో  మలచబడుతున్నాయని చెప్పాడు. తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయాన్ని తాను త్వరలోనే ప్రకటిస్తాననీ .. అప్పటివరకూ ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేశాడు. దాంతో రకుల్ మళ్లీ చైతూ జోడీ కట్టనుందనే ప్రచారానికి తెరపడినట్టైంది.
     Some news today reporting my next projects which isn’t true..shooting fr savyasachi & Maruthi Garu’s film,excited with the way both films are shaping up.been blessed this year listening to some really nice content.will announce my next soon,whatever you hear otherwise is NOT TRUE

మరింత సమాచారం తెలుసుకోండి: