మేఘనా నాయుడు.. అచ్చ తెలుగు అమ్మాయి. విజయవాడలో పుట్టిన ఈమె నటిగానే కాకుండా డ్యాన్సర్ గా రాణించింది. లతా మంగేష్కర్ పాడిన తోడా రేషమ్ లగ్తాహై పాటను రీమిక్స్ చేసి కలియోం కా చమన్ అంటూ హుషారెత్తించింది. దాంతోనే మేఘనా నాయుడు పాపులర్ అయింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన అనుభవం ఆమెకు ఉంది. అయితే ఇప్పుడామెను మొత్తం దోచుకెళ్లిపోయారట.

Image result for meghana naidu

విజయవాడలో పుట్టినా.. మేఘనా పెరిగిందంతా ముంబైలోనే..! ముంబైలో నివసించే మేఘనాకు గోవాలో ఓ ఇల్లుంది. ఆ ఇంట్లో ఓ గార్డియన్ ను కూడా పెట్టింది. ఇటీవలే ఆ ఇంటిని వేరేవాళ్లకు అద్దెకిచ్చింది. కొంతకాలం క్రితం ఆ ఇంట్లో ఓ జంట అద్దెకు దిగింది. తాము న్యూజీలాండ్ జాబ్ చేస్తుంటామని, గోవాలో ఓ పనికోసం ఇక్కడికొచ్చామని ఆ జంట వివరణ ఇచ్చింది. ముంబై నేటివ్ అని చెప్పి ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు చూపించారు. దీంతో నమ్మి వాళ్లకు ఇంటిని అప్పగించింది మేఘనా.


అయితే కొంతకాలంగా వాళ్లు వాళ్లు అద్దె చెల్లించట్లేదు.! గాయబ్ అయ్యారు. విషయం ఆరా తీస్తే అసలు వాళ్లు పత్తా లేకుండా పారిపోయారట. వెళ్తూ వెళ్తూ ఇంట్లోని సామానంతటినీ తీసుకెళ్లిపోయారట. చివరకు మేఘనా ఇన్నర్స్ ను కూడా వదిలిపెట్టలేదట. సాక్సులు కూడా వదిల్లేదట. అంతేకాదు.. ఇంట్లో గార్డియన్ గా నియమించిన వారి దగ్గర మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ 85 వేలు వసూలు చేశారట. ఈ విషయాన్ని మేఘనా స్వయంగా ఫేస్ బుక్ లో వెల్లడించింది. ఈ కేటుగాళ్లను పట్టుకోవడానికి మేఘనా సోషల్ మీడియాను ఎంచుకుంది. వాళ్ల ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. అయితే పోలీసులకు కంప్లెయింట్ చేసిందా లేదా అనేది తెలియట్లేదు. ఏదైతేనేం.. మేఘనా ఇంటిని దోచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: