పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసి చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా గుడ్‌బై చెప్పేసింది. ఆయన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రియంక ఇందుకోసం కుదుర్చుకున్న కాంట్రాక్టును తాజాగా రద్దు చేసుకుంది. మరోవైపు సూరత్ లో ఉన్న ఆయనకు చెందిన రెండు సెజ్ లను ఈడీ సీజ్ చేసింది.
Image result for priyanka chopra
దీంతో, అందులో పని చేస్తున్న 700 మంది ఉద్యోగులు వీధినపడ్డారు.2017 జనవరిలో నీరవ్ మోడీతో బ్రాండ్ ప్రచారానికి ప్రియాంక చోప్రా అగ్రిమెంట్ చేసుకుంది. అప్పట్నించి ఆ బ్రాండ్ కోసం పలు ప్రచార ప్రకటనల్లో నటించింది. నీరవ్ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రియాంకతో పాటు, మోడల్ కమ్ నటి లిసా హేడెన్ కూడా ప్రచారం సాగిస్తోంది. రూ.11,400 కోట్ల మేరకు తమను మోసం చేసినట్టు ఇటీవల పీఎన్‌బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ, ఈడీ దేశవ్యాప్తంగా నీరవ్ ఆస్తులపై దాడులు సాగిస్తోంది.
Image result for nirav modi
ప్రస్తుతం క్వాంటికో టీవీ సిరీస్ చిత్రీకరణలో ప్రియాంక బిజీగా ఉంది. ఏప్రిల్ 28 నుంచి సిరీస్-3 ప్రసారం కానుంది. దీనికితోడు రెండు హాలీవుడ్ చిత్రాల్లో కూడా ఆమె నటించనుంది. ఇప్పటికే నీరవ్‌పై రెండు ఎఫ్ఐఆర్‌లను కూడా ఏజెన్సీ సంస్థలు నమోదు చేశాయి. సీబీఐ దర్యాప్తు ప్రారంభానికి ముందే నీరవ్, ఆయన భార్య, వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీ విదేశాలకు ఉడాయించిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: