అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో భారత సినిమా పరిశ్రమ షాక్ లో ఉంది. ఈరోజు ఉదయం నుండి దావాలనంగా వ్యాపించిన ఈవార్త విని కోట్లాదిమంది భారతీయులు ఇంకా శ్రేదేవి మరణ వార్తను నమ్మలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఆమె గొప్పతనం గురించి ఆమె క్రేజ్ గురించి తెలియ చెప్పే ఎన్నో కథనాలు మీడియాలో వార్తలుగా వస్తున్నాయి.
పెళ్లికి ముందే శ్రీదేవి పెళ్లికి ముందే శ్రీదేవి గర్భం
ఆందానికి మారుపేరుగా నిలిచే శ్రీదేవికి మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడ విపరీతమైన అభిమానులు ఉన్నారు. సింగపూర్ లోని ఒక హోటల్ యాజమాన్యం అయితే శ్రీదేవి పింగాణి బొమ్మను తయారుచేయించి తమ రెస్టారెంట్లో గతంలోనే పెట్టుకుంది. సింగపూర్ లో ‘ఢిల్లీ రెస్టారెంట్’ అన్న పేరుతో ఉన్న ఈ హోటల్ సింగపూర్ వెళ్ళే సందర్శకులందరికీ సుపరిచితం. 

ఆ హోటల్ లో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి అక్కడ ఏర్పాటుచేసిన శ్రీదేవి బొమ్మ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. శ్రీదేవి గురించి ఆమె నటకౌశలం గురించి వివరిస్తూ ఈబొమ్మ కింద శ్రీదేవి గొప్పతనం గురించి వివరిస్తూ కొంత సమాచారాన్ని కూడ ఉంచారు. భారత సంప్రదాయాన్ని గుర్తు చేసేలా చీరకట్టు ఒంటినిండా నగలు ధరించిన శ్రీదేవి బొమ్మ భారతీయ సాంప్రదాయానికి నిలువెత్తు దర్పణంలా ఆ రెస్టారెంట్ లో అందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. కేవలం శ్రీదేవి బొమ్మను చూడటానికి ఆ రెస్టారెంట్ కు చాలామంది వెళుతూ ఉంటారు అంటే శ్రీడివి అంటే భారతీయులకు ఎంత అభిమానమో మనకు తెలియ చేస్తుంది.

చివరిగా గత ఏడాది శ్రీదేవి ‘మామ్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్రం నటిగా శ్రీదేవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. కమర్షియల్‌ గా ఈ సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినప్పటికీ క్రిటికల్ అక్లైమ్ అందుకుని విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈసినిమా తరువాత శ్రీదేవి నటించవలసిన మరో రెండు సినిమాలు ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. అయితే ఈ విషయాలు అన్నీ పక్కకు పెట్టి తన కూతురు జాన్వి కెరియర్ పై దృష్టి పెట్టిన శ్రీదేవి ‘మామ్’ గా తన పాత్ర నిర్వర్తించకుండానే చనిపోవడం విధిరాత అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: