అర్జున్ రెడ్డి సినిమాతో విపరీతమైన పాపులర్ హీరోగా సూపర్ హిట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త తరం కుర్రకారు కి ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. విజయ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏవీ విడుదల కి సిద్ధంగా లేవు కానీ ఎప్పుడో చేసిన ఒక సినిమా మాత్రం విడుదల కి సిద్ధమైంది. రెండేళ్ళ క్రితం విజయ్ ఏం మంత్రం వేసావే అంటూ ఒక సినిమా చేసాడు.

ఆ సినిమా మొదలయ్యే టైం కి అతను ఎవడె సుబ్రహ్మణ్యం ఒక్కటే చేసాడు అతనికి సరైన గుర్తింపు కూడా లేదు అప్పట్లో. ఆ తరవాత కొన్ని కారణాల వలన ఆ సినిమా విడుదల కాలేదు. ఆ కొన్నాళ్ళకి విజయ్ నుంచి అర్జున్ రెడ్డి రావడం అది సంచలనం అవ్వడం మనకి తెలిసిందే.

‘పెళ్ళి చూపులు’.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో విజయ్ క్రేజ్ పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో పడింది ‘ఏ మంత్రం వేసావె’ చిత్ర బృందం. ‘గోలీసోడా’ ప్రొడక్షన్స్ బేనర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీధర్ మర్రి అనే కొత్త దర్శకుడు రూపొందించాడు.

విజయ్ తో శివానీ సింగ్ అనే కొత్త పిల్ల నటించింది. మార్చ్ 9 న ఈ సినిమా విడుదల కి సన్నాహాలు చేస్తున్నారు. మార్చ్ 2 న సినిమా పరిశ్రమ సమ్మె ఉండడం తో మార్చ్ 9 న ఆ సమ్మె ముగిసిపోతే గనక ఈ చిత్రం విడుదల అవుతుంది. లేదంటే తర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: