అతిలోక సుందరి శ్రీదేవి మరణం మొత్తం దేశాన్ని తలకిందుల చేసింది. ఆమె అందం, అభినయం ఉన్న అద్భుతమైన నటి. ఆమె మరణిస్తే దేశం మొత్తం బాధ పడుతోంది. నాలుగేళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన ఆమె ప్రయాణం ఆఖరి క్షణం వరకూ కూడా సినిమాలలోనే సాగుతూ వస్తోంది.


స్వశక్తితో ఎదుగుతూ.. ఎదురుదెబ్బలకు వెరవకుండా.. ఎంతకూ అర్థంకాని ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయటమే కాకుండా తల్లిగా, భార్యగా కూడా తన ఫ్యామిలీ ని చక్కగా చూసుకుంది శ్రీదేవి. భారత చలనచిత్ర పరిశ్రమలో ఆమె సాటి వచ్చే మహిళా నటి మరొకరు ఉండరేమో అన్నంత లెజెండ్రీ స్టేటస్ ని ఆమె సొంతం చేసుకుంది. ఆమె బోణీ కపూర్ భార్య అని మనందరికీ ఎప్పుడో తెలుసు.


అయితే అతని మొదటి భార్య మోనా కపూర్ గురించి చాలామందికి తెలీదు. ఆమె 2012లో మరణించారు. ఆమె మరణంలోనూ.. తాజాగా శ్రీదేవి మరణంలో ఒక పోలిక ఉండటం గమనార్హం. ఆమె కొడుకు అర్జున్ కపూర్ ని కూడా తెరమీద చూసుకోవాలి అని మోనా ఎప్పుడూ కోరుకునేవారు. అర్జున్ కపూర్ మొదటి సినిమా విడుదల కి సరిగ్గా నెలరోజుల ముందర ఆమె క్యాన్సర్ తో చనిపోయారు.


సరిగ్గా  శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవిని వెండితెర మీద చూసుకోవాలనిశ్రీదేవి ఎంతగానో తపించారు. శ్రీదేవి అంత కాకపోయినా మంచి నటిగా ఆమె కూతురు ఎదగాలని కోరుకున్నారు శ్రీదేవి. తాజాగా జాహ్నవి నటిస్తున్న ధడక్ చిత్రం ఈ ఏడాది జులైన 14న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రం విడుదలకు నాలుగు నెలల ముందు శ్రీదేవి అనూహ్యంగా మృతి చెందటం గమనార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: