అసలు రాం నిజంగా ఏ భక్తి భయం ఏ సెంటిమెంట్ లేని వ్యక్తిగా కనిపిస్తారు. ప్రతి విషయంలో మనం చూసే కోణం వేరు. రాము చూసే కోణం మరో లాగా ఉంటుని. శ్రీదేవి మరణం దేశ ప్రజలనే కలచివేసింది. అందరం ఆ వెదన వెల్లువలో కొట్టుకుపోతున్నాం. అయితే రాము లోకం వేరు.    
postmortem of Sridevi kapoor కోసం చిత్ర ఫలితం
అందాల నటి శ్రీదేవి మృతిని ఈ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఆమె మరణవార్త విన్నప్పటి నుంచి వర్మ తన వేదన సోషల్‌ మీడియావేదికగా పంచుకుంటూనే ఉన్నారు. శ్రీదేవి మృతి చెందింది అంటే తాను నమ్మలేకపోతున్నానని అన్న వర్మ, తనజ్ఞాపకాల్లో శ్రీదేవి ఎప్పటికీ జీవించే ఉంటుందని పేర్కొన్నారు. అయితే శ్రీదేవి మృతిపై ఏర్పడిన మిస్టరీ కారణంగా ఇప్పుడు చర్చంతా, ఆమె ఎలా చనిపోయింది? ఆ పూర్వా పరాలేమిటి? అనే అంశం చుట్టు తిరుగుతోంది. దీంతో వర్మ ఇది సహించ లేకపోతున్నారు. 
 sridevi kapoor with ramgopal varma కోసం చిత్ర ఫలితం
శ్రీదేవి ఉన్నంతకాలం ఆమె అందం గురించి చర్చించిన వారంతా, ఇప్పుడు ఆమె చనిపోయినతీరుపై స్పందిస్తున్నతీరు తనని ఎంతో బాధకి గురిచేస్తోందని వర్మ పేర్కొ న్నారు. "శ్రీదేవికి సంబంధించి, అందరూ ఆమె శారీరక అందం, తన కళ్లు, పెదాలు గురించి మాట్లాడి, ఇప్పుడు ఆమె మృత దేహం, తన రక్తంలో మద్యం, ఊపిరితిత్తుల్లో నీరు, తన కడుపులో ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నారు! దేవుడా" అంటూ అత్యంత వేదనాత్మక ట్వీట్ చేశారు.
sridevi kapoor's dead body కోసం చిత్ర ఫలితం 
ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ, "ఒక మనిషి జీవితం ఇంత విషాదకరంగా, ఇంత భయంకరంగా ఎలా ముగుస్తుంది. తనని ఇంత కఠినాత్మకంగా విచ్ఛిన్నం చేయడం నన్ను ఎంతో భయానికి గురి చేస్తోంది. అసలు ఆ విషయం తలుచుకుంటుంటేనే, నన్ను నేనే చంపేసుకోవాలనిపిస్తుంది" అంటూ తన బాధని ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు.

postmortem of Sridevi kapoor కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: