ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ భుజానికి శస్త్రచికిత్స చేశారు. అయితే ఈ విషయాన్ని మాధవన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఆసుపత్రి బెడ్పై తీసిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఫైటర్ మళ్లీ ట్రాక్లో పడ్డాడు. కుడి చేతికి స్పర్శ తెలియడం లేదు’ అంటూ ట్విట్టర్ లో తెలిపారు.
ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో హీరో నాగ చైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రంలో నటిస్తున్నాడు మాధవన్. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో మాధవన్తోపాటు భూమిక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మార్చిలో ఈ చిత్రం రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. మాధవన్కి సర్జరీ జరిగిందనే విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలోను మాధవన్ నటించనున్నాడు.
చివరి సారిగా విక్రమ్ వేద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాధవన్ త్వరలో ఒండ్రగా అనే తమిళ చిత్రంతో పాటు చందమామ దూర్ కే అనే హిందీ చిత్రంలోను నటించనున్నాడు. హిందీ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్, నవాజుద్ధీన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. తర్వాత మాధవన్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించనున్న తమిళ సినిమాలో నటించనున్నారు