అందచందాలలో భారతీయమహిళలది ఒక  ప్రత్యేకస్థానం. మిస్ వరల్డ్ టైటిల్ ను భారత్ 6  సార్లు గెలుచుకొని వెనిజులా తో పాటు మొదటిస్థానంలో కొనసాగుతుంది. 2000 వ సంవత్సరంలో ప్రియాంక చోప్రా టైటిల్ ను సాధించగా ఆ తరువాత నుండి భారత్ కు ప్రతీసారి నిరాశే ఎదురయింది.


దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ తరువాత మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకుని దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇక అప్పటినుండి ఈ అమ్మడుకు యావత్ దేశ కుర్రకారు అందరూ ఆమెకు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఈమెను అనుసరించేవారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మానుషీ కూడా తాను ఏం చేస్తున్నది, ఎక్కడికి వెళ్తుంది అనే ప్రతీ విషయన్ని అభిమానులతో పంచుకుంటుంది.


తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన ఒక పోస్టు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. కొండల నడుమ పసుపు వర్ణంగల వన్ పీస్ బికినీ వేసుకొని దిగిన ఫోటోను ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ఫోటో ఇంటర్నెట్ వ్యాప్తంగా వైరల్ అయింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికొస్తే ప్రస్తుతం ఆమె సోనపట్‌లోని భగత్‌ఫూల్‌ సింగ్‌ ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసిస్తోంది. కార్డియాలజీ వైద్య నిపుణురాలు కావడమే ధ్యేయమని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: