మాస్ మహరాజ్ రవితేజ క్రేజీ డైరక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. అమర్ అక్బర్ ఆంటోని టైటిల్ తో కెరియర్ లో మొదటిసారి రవితేజ ట్రిపుల్ రోల్ చేస్తున్న సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా అను ఇమ్మాన్యుయెల్ మాత్రం ఓకే అయ్యింది.


ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ కావాలని పట్టుబట్టినా సారీ అనేసిందట అమ్మడు. దీని వెనకాల పెద్ద రీజనే ఉందని అంటున్నారు. కాజల్ రవితేజ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అందుకే కాజల్ రవితేజతో సినిమా అంటే ఇష్టంగా లేదట. అయితే శ్రీను వైట్లతో మాత్రం కాజల్ మంచి ఫలితాలే రాబట్టింది.


అయినా కూడా కాజల్ మాత్రం ఈ సినిమాకు ససేమీరా ఒప్పుకోలేదట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేయాలని అనుకుంటుందట. అందుకే రెమ్యునరేషన్ లో కూడా కోత ఉంటుందని అమ్మడు ఎందుకొచ్చిన గొడవని సినిమాకు డేట్స్ ఖాళీలేవని చెప్పేసిందట.


టాలీవుడ్ లో దాదాపు కెరియర్ అయిపోయింది అనుకున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150, రానా నేనే రాజు నేనే మంత్రి సినిమాలు పడేసరికి అమ్మడు మళ్లీ ట్రాక్ ఎక్కింది. ప్రస్తుతం కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ సినిమాతో పాటుగా శర్వానంద్ సినిమాలో కూడా నటిస్తుంది కాజల్.



మరింత సమాచారం తెలుసుకోండి: