టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ఏరియా నైజాం. ఈ సందర్భంగా నైజాంలో ఎక్కువ థియేటర్లు ఆసియన్ సునీల్ చేతిలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి నైజాం ఏరియాలో థియేటర్లు చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఆసియన్ సునీల్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆసియన్ సునీల్ ఆంధ్ర రాష్ట్రం పై కన్నేశాడు.  


ఆంధ్రలో దగ్గుబాటి సురేష్ కు బలంగా పునాదులు వున్నాయి. ఇప్పటి దాకా ఆయనకు సురేష్ తో వ్యాపార బంధాలు వున్నాయి.కానీ ఆంధ్రలో పోటీ కూడా బలంగానే వుంది. ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి సురేష్ కు పోటీ వుంది. అయితే ఇప్పడు సురేష్ కు తోడుగా వుండడానికో, తను కూడా బలమైన ప్లేయర్ గా మారడానికో ఆసియన్ సునీల్ కూడా ఆంధ్రలో అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


కనీసం ఆంధ్ర, సీడెడ్ కలిసి 200థియేటర్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంతేకాకుండా తొందరలోనే నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టాలని చూస్తున్నాడు ఆసియన్ సునీల్…. .ఈ క్రమంలో ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ కొడుతున్న ఇద్దరి హీరోలతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: