టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉండనే ఉంటుంది. అందం, అభినయంతో అలరించే హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే ఇక్కడ స్టార్ స్టేటస్ అందుకుంటారు. ఇక ఒక్కసారి స్టార్ ఇమేజ్ వస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అయితే మొదట రెండు సినిమాలతో పర్వాలేదు అనిపించుకుని రూటు మార్చి బికినితో బీభత్సం సృష్టించిన ఓ చిన్నది ఇప్పుడు వరుస స్టార్ అవకాశాలతో షాక్ ఇస్తుంది.


ముకుందా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దె. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాతో కూడా పర్వాలేదు అనిపించుకుంది. అయితే హృతిక్ తో మొహెంజోదారో సినిమా చేసిన ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథంలో బికిని వేసి అందరిని పడేసింది. ఇన్నాళ్లు ఆమెలోని దాగున్న అందాలన్ని బికినితో బయట పడ్డాయి.


ఆ సినిమా కూడా హిట్ అవడంతో అమ్మడికి ఇక వరుస ఛాసులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే సాక్ష్యం అంటూ బెల్లంకొండ బాబు సినిమా చేస్తున్న పూజా హెగ్దె.. త్రివిక్రం ఎన్.టి.ఆర్ సినిమాతో పాటుగా మహేష్ వంశీ పైడిపల్లి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందట. ఇక ఇవే కాకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత చేసే సినిమాలో కూడా అమ్మడు హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు.


జిల్ డైరక్టర్ రాధాకృష్ణ యువి క్రియేషన్స్ బ్యానర్లోనే ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్దెని ఫైనల్ చేశారట. మరి వరుస స్టార్ అవకాశాలతో అమ్మడు కొన్నాళ్లు టాలీవుడ్ ను ఏలేస్తుందని అంటున్నారు. మిగతా హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది పూజా హెగ్దె.



మరింత సమాచారం తెలుసుకోండి: