బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న అమితాబ్ అనారోగ్యం బారిన పడటంతో వెంటనే.. స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.  గత ఆరు నెలలుగా అమితాబ్ బచ్చన్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
కూలీ షూటింగ్ సమయంలో
గత వారంరోజులుగా ఎక్కువ గంటలు షూటింగ్ కేటాయించడంతో అస్వస్థతకు గురైనట్టు తెలుస్తున్నది.బిగ్‌బీ అనారోగ్యానికి కారణాలు తెలియరాలేదు. అయితే ఆయన ఆరోగ్యానికి అంత ముప్పేమీ లేదని వైద్యులు వెల్లడించినట్టు తెలుస్తున్నది. అనారోగ్యం తీవ్రత మరింత ఎక్కువైతే ముంబైకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ముంబైకి తరలించే అవకాశం
ఈ నేపథ్యంలో బిగ్ బీకి అనారోగ్యం అన్న వార్త విని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.  అమితాబ్ మ‌రోసారి అస్వస్థతకు గుర‌వడంతో అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌ చెందుతున్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీ పడుతూ తనదైన నటనతో అభిమానులను అలరిస్తున్న అమితాబ్.. థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాతో పాటు బ్రహ్మస్త్రా, 102 అనే చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: