సుకుమార్ రైటింగ్స్ అండ్ ప్రొడక్షన్ బ్యానర్లో వచ్చిన మొదటి సినిమా కుమారి 21ఎఫ్. రాజ్ తరుణ్, హెబ్భా పటేల్ లీడ్ రోల్స్ గా నటించిన ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన హెబ్భా పటేల్ అంతకుముందు వరకు ఎవరికి తెలియదు కాని కుమారితో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.


అలా ఎలా సినిమాలో హీరోయిన్ గా నటించిన హెబ్భా పటేల్ ఆ సినిమా తర్వాత కుమారికి సెలెక్ట్ అవడం అమ్మడి కెరియర్ కు బాగా కలిసి వచ్చింది. ఇక సినిమాలో అమ్మడి లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది. కుమారి సక్సెస్ తర్వాత హెబ్భా పటేల్ రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మడి కెరియర్ కాస్త అటు ఇటుగా ఉంది.


అయినా సరే తనకు స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసిన సుకుమార్ పిలిచి మరి ఛాన్స్ ఇస్తా అన్నా సరే సారీ అనేసిందట హెబ్భా పటేల్. అదేంటి అలా ఎందుకు అనేసింది అంటే.. సుకుమార్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమా రగస్థలం. ఆ సినిమాలో హెబ్భాకి ఓ చిన్న రోల్ ఇచ్చాడట సుక్కు.


అయితే అది సినిమాలో ప్రాముఖ్యత ఉన్న పాత్రే కాని నిడివి తక్కువగా ఉండటం వల్ల ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిందట హెబ్భా. అసలే అవకాశాలు లేక ఖాళీగా ఉన్న హెబ్భా అందివచ్చిన అవకాశాన్ని కూడా కాదనుకుంది. ఇక హెబ్భా కాదన్న ఆ రోల్ ను హాట్ యాంకర్ అనసూయ చేసిందని అంటున్నారు. మరి సినిమా చూశాక కాని హెబ్భా మంచి ఛాన్స్ మిస్సయ్యానని అనుకుంటుంది కాబోలు.



మరింత సమాచారం తెలుసుకోండి: