బాలీవుడ్ లో మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ఖాన్ 53వ పుట్టినరోజు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దేశంలోనే నంబర్ 1 హీరోగా వెలిగిపోతున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఈసారి తన పుట్టినరోజు వెరీ స్పెషల్ చేసుకోబోతున్నాని అభిమానులకు చెప్పారు.
ఓవైపు భారత్, మరోవైపు చైనా రెండు మార్కెట్లను కొల్లగొట్టిన ఉత్సాహంలో ఉన్నాడు.
తాను ఈ స్థాయికి ఎదగడం వెనక ఓ స్త్రీ మూర్తి ఉందని ఆమె ఎవరో కాదు తనే అమ్మ.. తనకు అమ్మ అంటే ఎంతో ఇష్టం. అందుకో అమ్మ రూపాన్ని ఓ అందమైన చిత్తరువుగా స్కెచ్ వేసి దానిని తనకు కానుకగా ఇచ్చారు. ఫ్యాన్స్తో తమ ఫోటోలను షేర్ చేసుకునేందుకు ఇప్పుడు సెలబ్రిటీలు ఇన్స్టాగ్రమ్ను ఎంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు అమీర్ ఖాన్ ఇన్స్టాగ్రమ్లో చేరారు.
తొలి పోస్ట్గా తన తల్లి జీనత్ హుస్సేన్ ఫోటోను పోస్ట్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్లో జోరుమీదున్న అమీర్ ఇకమీదట ఇన్స్టాగ్రమ్ ద్వారాను వేగంగా అభిమానులకు కనెక్టయ్యేందుకు ప్లాన్ చేశాడు. తన జన్మదినం రోజున తల్లికి వందనం చేస్తూ అమీర్ ఖాన్ ఈ ఫోటోను పోస్ట్ చేశారు.
అటు ఇందులో డిస్ప్లే పిక్గా తన లేటెస్ట్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ చిత్రంలోని ఫోటోను ఉంచారు. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఈ ఏడాది నవంబర్ 7న రిలీజ్ కానుంది.