జూనియర్ చరణ్ లతో రాజమౌళి తీయబోతున్న భారీ మల్టీ స్టారర్ విషయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈమధ్య ఈసినిమా విషయంలో ఒక ఫోటో షూట్ కు చరణ్ జూనియర్ లు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళ్ళారు అన్న విషయం తెలిసిందే. అయితే చరణ్ జూనియర్ లు అమెరికా వెళ్ళింది ఫోటో షూట్ కోసం కాదు వారి వారి బాడీ స్కాన్ కోసం అని తెలుస్తోంది. 
 వచ్చే వేసవి బరిలో
మొదట్లో ఈసినిమాకు రాజమౌళి ‘ఈగ’ ‘బాహుబలి’ సినిమాలులా గ్రాఫిక్ వర్క్స్ లేకుండా ఈమల్టీ స్టారర్ ను నిర్మించాలి అనుకున్నాడు. ఇప్పుడు ఆలోచనలు మారడంతో ఈమూవీలో కూడ కొంత వరకు గ్రాఫిక్స్ ఉంటాయని తెలుస్తోంది. అందుకోసమే ఈ ఇద్దరు హీరోల్ని అమెరికాకు పంపి టోటల్ బాడీ స్కాన్ చేయించాడు రాజమౌళి అని టాక్. ఈ సినిమా ను  సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్న నేపధ్యంలో గ్రాఫిక్స్ వర్క్ ముందే కొలిక్కివస్తే అందుకోసం అదనపు టైం కేటాయించాల్సిన అవసరం ఉండదనేది జక్కన్న ఆలోచన. 
బ్రదర్స్‌గా మెగా, నందమూరి హీరోలు
అందుకే బాడీ స్కాన్ పూర్తయిపోతే అందుకు తగ్గట్టు గ్రాఫిక్ టీం పనులుపెట్టడానికి ఈహడావిడి అని అంటున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ షూటింగ్ కంప్లీట్ చేసి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ పై ఫోకస్ పెట్టబోతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకోసం కసరత్తు చేస్తున్నాడు.   
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో వీరిద్దరినీ తమ రెండు సినిమాల షూటింగులను ఎట్టి పరిస్థితులలోను రాబోతున్న జూలై లోపున పూర్తి చేసుకుని ఆగష్టులో జరిగే తన మూవీ వర్క్ షాప్ కు రెడీ అవ్వవలసిందిగా రాజమౌళి వీరిద్దరికీ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈమూవీలో హీరోయిన్ గా సమంత ఎంపిక ఖాయం అయినా చరణ్ జూనియర్ లలో ఎవరికి జంటగా సమంతను ఎంపిక చేయాలి అన్న సందిగ్ధం రాజమౌళిని వెంటాడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: