తెలుగు ఇండస్ట్రీ లో జరుగుతున్న చీకటి కోణాలు చాలా మంది ఇప్పుడు వెలుగు లోకి తెస్తున్నారు. వారు పడుతున్న మానసిక, శారీరిక భాదలను భహిరంగంగా బయటికి చెబుతున్నారు. అయితే కొంత మంది హీరోయిన్స్ చేబుతున్న మాటలు నిజంగా వీరు చెబుతున్నది నిజమేనా లేక పుబ్లిసిటి కోసం చెబుతున్నారా అని అర్ధం కావడం లేదు.
అయితే తాజాగా యాంకర్ శ్రీరెడ్డి. ప్రతీ ఇండస్ట్రీలో ఈ సమస్య ఉందని చెప్పిన ఆమె, తమిళ ఇండస్ట్రీలో అయితే డెడికేషన్ చూపిస్తారా? అని అడుగుతారని, అదే తెలుగులో మాత్రం కమిట్మెంట్ ఇస్తారా? అని అడుగుతారని, ఆ మాటలకి అర్థం పడుకోడానికి సిద్ధమేనా? అని అర్థం చేసుకోవాలని చెప్పింది. " సినిమా కథ చెప్పకముందే, మీరు పడుకోడానికి సిద్ధమేనా… అని ఇన్డైరెక్టుగా ప్రశ్నిస్తారని ఆరోపించింది. పోనీలే… అని అవకాశం కోసం అన్ని చంపుకుని ఒప్పుకుంటే చివరికి తెలుగు అమ్మాయిలకి దక్కేది చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక పడుకోడానికి ఇష్టపడలేదంటే అవకాశమే ఉండదని చెప్పింది. పవన్ కళ్యాణ్ లాంటి ప్రతీ స్టార్ హీరోకి ముంబై హీరోయిన్లే కావాలి. లేదా కన్నడ, తమిళ, మలయాళీ అమ్మాయిలు కావాలి.ఎందుకంటే తెలుగు అమ్మాయిలు అయితే కమిట్ మెంట్ ఇవ్వరని,అందుకే ఛాన్స్ ఇవ్వడం లేదని,కమిట్ మెంట్ ఇచ్చే పరభాష నటీమణులకే అవకాశాలు ఇస్తున్నారని మండిపడింది. నేనొక సినీ రిపోర్టర్గా, న్యూస్ రీడర్గా కూడా పనిచేశాను. కాబట్టి ఇంత ధైర్యంగా చెబుతున్నారు. మొన్న అర్చన చెప్పింది, అంతకు ముందు రాధిక ఆప్టే చెప్పింది. ఈ మధ్యనే శ్రియ కూడా దీని గురించి మాట్లాడింది…
ఎన్ని పక్కల కింద నలిగితే సినిమాలొస్తాయో నాకు తెలుసు. ఆఫర్ల కోసం నా శరీరాన్ని దాచుకోకుండా ఎక్స్పోజ్ చేస్తున్నా అని చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.