ఈ మద్య తెలుగు హీరోలు వైవిధ్యభరిత చిత్రాల్లో నటించి మెప్పిస్తున్నారు. రొటీన్ కి భిన్నంగా వైవిధ్య కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న నారా రోహిత్ మరో సాహసం చేయబోతున్నాడు. తన తదుపరి సినిమాలో మూగవాడి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ హీరో. ఆ మద్య జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ నత్తి వాడిగా నటించిన విషయం తెలిసిందే. ఇక సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రంలో చెవిటి వాడి పాత్రలో నటిస్తున్నాడు రాంచరణ్. ఇలా ప్రయోగాత్మక పాత్రల్లో నటించి నటనకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజాగా నారా రోహిత్ కూడా మూగవాడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నారా రోహిత్ పెద్దగా విజయం సాధించిన సినిమాలు ఏవీ లేకున్నా మనోడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఉగాది కానుకగా లాంచ్ కాబోతున్న ఈ మూవీ నారా రోహిత్ కెరియర్లో 18వ చిత్రం. ఈ మూవీలో నారా రోహిత్ మాటలు రాని వ్యక్తిగా కనిపిస్తున్నట్టు ‘వరల్డ్ ఆఫ్ ది వర్డ్ లెస్’ అనే ప్రమోషన్ క్యాప్షన్ని బట్టి తెలుస్తోంది.
సినిమా మొత్తంలో నారా రోహిత్కి ఒక్కడైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోటే కథను నడిపించే పెద్ద ప్రయోగం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మాణంలో తెరకెక్కనుంది.
కాగా ప్రస్తుతం నారా రోహిత్.. వీరభోగ వసంత రాయ, పండగాలా వచ్చాడు, ఆటనాదే వేటా నాదే చిత్రాలు సెట్ మీద ఉన్నాయి. ఈ చిత్రానికి కథ, మాటలు : వంశీ రాజేష్, సంగీతం : వికాస్ కురిమెళ్ళ, ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : ఎల్ రిచర్డ్ ప్రసాద్, దర్శకత్వం: పిబి మంజునాథ్.